TDP State General సెక్రటరీ గౌతు శిరీష కు AP CID నోటీసులు జారీచేసింది. అమ్మఒడి ,వాహనమిత్ర పధకాలు రద్దు అంటూ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుపై గౌతు శిరీష కు నోటీసులు జారీచేశారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట లోని శివాజీ నివాసానికి నిన్న రాత్రి వెళ్లిన సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు. ఈ నెల 6న మంగళగిరి లోని సీఐడీ కార్యాలయంలో విచారణకు రావాల్సిందిగా నోటీసు లో పేర్కొన్నారు. సీఆర్పీసిలోని సెక్షన్ 41 క్రింద నోటీసు జారిచేసినట్టు సమాచారం.